మేలుకుంటేనే మేలు.. స్వయంపాలనతోనే గ్రామీణాభివృద్ధి
-సంఘటితంగా కదులుదాం
- ప్రజలంతా చేతులు కలిపితే వేల కోట్ల సంపద
- గంగదేవిపల్లి, అంకాపూర్, ముల్కనూర్..
ఈ మూడు గ్రామాలే అందుకు నిదర్శనం
- ప్రతీపశక్తులను పట్టించుకోవద్దు
- వ్యక్తులుగా బాగుంటున్నా.. సంఘంగా విఫలమవుతున్నాం
- గ్రామాల అభివృద్ధితోనే బంగారు తెలంగాణ
- గుడుంబా రాక్షసిని తరిమికొట్టాలి: సీఎం
- గంగదేవిపల్లిలో గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు
ప్రజలంతా చేతులు కలిపితే ఆ చేతులు వేల కోట్ల సంపదను సృష్టిస్తాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పారు. ప్రజలకు తమ సంఘటిత శక్తిలోని విలువ ఎంతో తెలియదని, గతంలో ఎవరూ చెప్పే ప్రయత్నం చేయలేదని అన్నారు. ఇకనైనా మేలుకొని ఎవరి గ్రామాన్ని వారే అభివృద్ధి చేసుకోవాలే తప్ప బయటివారు వచ్చి బాగుచేయరని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం బంగారు తెలంగాణ అవుతుందని సీఎం చెప్పారు. ఇందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. అభివృద్ధిని దెబ్బతీసే ప్రతీపశక్తులు అంతటా ఉంటాయని, వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగాలని ఉద్బోధించారు. వెలుతురు వెంటే చీకటి ఉంటుంది.
చీకటిని చూసి బెదిరిపోవద్దు, భయపడొద్దు. వ్యతిరేకించేవాళ్లు మనమధ్యే ఉంటారు. వారిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నారు. వ్యక్తులుగా మనం బాగుంటున్నాం కానీ.. కానీ సంఘంగా విఫలమవుతున్నామని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రజల సంఘటిత శక్తిలో ఉన్న పవర్.. ఫైర్ చాలా బలమైందన్న సీఎం.. ఆ బలంతోనే గంగదేవిపల్లి ఇరవై మూడేండ్లుగా మంచి అభివృద్ధి సాధించిందని చెప్పారు. రాష్ట్రంలోని పల్లెల ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేవేసే ప్రతిష్ఠాత్మక కార్యక్రమం గ్రామజ్యోతిని ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గంగదేవిపల్లిలో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రతి గ్రామం స్వయంపాలనతో స్వయం సమృద్ధి సాధించాలన్నదే గ్రామజ్యోతి లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం అందించే నిధులతో గ్రామానికి ఏం కావాలో ప్రజలే గ్రామసభల్లో నిర్ణయించుకొని అభివృద్ధిలో పాలు పంచుకోవాలని సీఎం పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ప్రసంగిస్తూ గ్రామజ్యోతి ఆశయాలు, ప్రణాళికలను ఆయన సుదీర్ఘంగా వివరించారు. గంగదేవిపల్లె ప్రజలు ఎవరి మీద ఆధారపడకుండా తమ గ్రామాన్ని తామే కమిటీలు వేసుకుని బాగు చేసుకున్నారని ప్రశంసించారు. తెలంగాణలో ప్రతి గ్రామం గంగదేవిపల్లిను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. అభివృద్ధిలో ముందున్న గంగదేవిపల్లి స్వయంసమృద్ధినికూడా సాధించాలని పిలుపునిచ్చారు. వ్యవసాయపద్ధతుల్లో కూడా మార్పులు చేసుకుని నిజామాబాద్ జిల్లా అంకాపూర్లాగా సంపన్నగ్రామం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీఎం ఏమన్నారో ఆయన మాటల్లోనే..
మీ స్ఫూర్తి గొప్పది..
గంగదేవిపల్లికి శిరస్సు వంచి మొక్కుతున్న. మీ స్ఫూర్తి గొప్పది. దేశ విదేశాల నుంచి చాలా మంది ఈ గ్రామానికి వచ్చి వెళ్లారు. నేను కూడా ఇక్కడికి వచ్చాను. రాష్ట్రంలో చాలా ఊళ్లు ఉన్నా వచ్చాను.. అంటే ఇక్కడ గంగమ్మతల్లులు రప్పించారు. వ్యక్తులుగా మనం బాగుంటున్నాం. కానీ సంఘంగా ఫెయిల్ అవుతున్నాం. ప్రజల సంఘటిత శక్తిలో ఉన్న పవర్.. ఫైర్ చాలా బలమైంది. ఆ బలంతో మీరు ఇరవై ఇరవైమూడేండ్లు మంచి అభివృద్ధి సాధించారు. మీకు మీరుగా గ్రామాన్ని గొప్పగా మలచుకున్నారు. ఇవ్వాళ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు. గంగదేవిపల్లిను చూస్తే కొత్త ఆశలు కలుగుతున్నయి. మీరు ఇక ఏదైనా సాధించగలరనే నమ్మకం ఏర్పడింది. అయితే ఇంతటితో ఆగకుండా స్వయం సమృద్ధి దిశగా ఎదగాలి
మూడు గ్రామాలు ఆదర్శం..
రాష్ట్రంలో మూడు గ్రామాలు ఎవరి మీదా ఆధారపడకుండా, ప్రభుత్వాలవైపు వేచి చేసి ఉండకుండా తమకు తోచిన విధంగా కట్టుబాట్లతో, పద్ధతులతో ఆదర్శవంతంగా ఎదిగాయి. నిజామాబాద్ జిల్లాలో అంకాపూర్, కరీంనగర్ జిల్లాలో ముల్కనూర్, వరంగల్ జిల్లాలో గంగదేవిపల్లి. ఈ మూడు గ్రామాలు ఆదర్శంగా, ప్రపంచం మెచ్చేలా నిలిచాయి. తెలంగాణలోని అన్ని గ్రామాలు ఈ మూడు గ్రామాలను ఆదర్శంగా, స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలి.
ఏ గ్రామానికాగ్రామం బాగుపడితే రాష్ట్రం బంగారు తెలంగాణ అవుతుంది. మనలో ఎంతో శక్తి ఉంది. భూమి మీదకు వచ్చినప్పుడు ఏదో ఒకటి చేసి వెళ్లాలి. మన స్ఫూర్తి భావితరాలకు ఆదర్శంగా ఉండాలి. పోరాడి తెచ్చుకున్న రాష్ట్రం బాగుపడాలి. ఎన్నికలు, రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి. బాగుపడడానికి గల కారణాలు అనేకం ఉంటాయి. చాలా సమస్యలు వస్తాయి. వెలుతురు వెంటే చీకటి ఉంటుంది. చీకటిని చూసి బెదిరిపోవద్దు, భయపడొద్దు. వ్యతిరేకించేవాళ్లు మనమధ్యే ఉంటారు. వారిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు
ఆర్థిక స్వాతంత్య్రం దిశగా అడుగేయండి
గంగదేవిపల్లి పట్టుదలతో సాధించిన ప్రగతి బాగా ఉంది. అయితే ఇంతటితో ఆగకుండా స్వయం సమృద్ధి దిశగా ఎదగాలి. స్వయం సమృద్ధి అంటే ఆర్థిక స్వాతంత్రం సాధించే దిశగా ఆలోచించాలి. గ్రామంలో అందరికీ భూమి ఉండదు. కాబట్టి భూమిలేని వాళ్లు, వృత్తిపనులు చేసుకునేవారికి ఇక్కడే ఉపాధి మార్గాలు సృష్టించి స్వయం ఉపాధి కల్పించుకోవాలి. వారికి ఆర్థిక చేయూతనివ్వాలి. వారితో రైతులకు కావలసిన ఎరువులు, విత్తనాలు గ్రామంలోనే అమ్మించి ఉపాధి కల్పించాలి. అట్లనే ఒక చెప్పుల దుకాణం పెట్టించాలి. ఆ దుకాణంలోనే ఊరోళ్లందరూ కొనుక్కునేలా చూడాలి. అదేవిధంగా కుట్టుమిషన్లు కొనిచ్చి ఉపాధి కల్పించాలి. ఇలా ఆయా వృత్తిపనుల వాళ్లకు ఉపాధి కల్పించే పని చేయవచ్చు. అలాగే మీ దగ్గర పంటల విధానం కూడా మార్చుకోవచ్చు.
ఇందుకు నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామం స్ఫూర్తిగా ఉంది. ప్రభుత్వం తరపున రెండు బస్సులు పెట్టి మిమ్మల్ని పంపిస్తా. వెళ్లి అక్కడ వ్యవసాయం పద్ధతులు చూసిరండి. అంకాపూర్లో కూడా మీలాగా బోర్లతోనే వ్యవసాయం చేస్తరు. అక్కడ గతంలో సర్వవర్గ సమితి ఉండే. కానీ దాని పేరు మార్చుకున్నారు. ఇప్పుడది విలేజ్ డెవల్మెంట్ కమిటీగా మారింది. ఆ గ్రామంలో పండే పంటలకు వారే మార్కెట్ చేసుకుంటారు. చేలనుంచి పంట వచ్చేసరికి ఆ గ్రామంవద్ద డజన్ల కొద్దీ డీసీఎంలు సిద్ధంగా ఉంటయి. అక్కడినుంచి అటే మార్కెట్కు తీసుకుపోతరు. అలాంటి పరిస్థితి మీ దగ్గర రావాలి. అలాగే గ్రామంలో డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి తేవాలి. ఇక్కడున్న 600 ఎకరాల వ్యవసాయ భూమి అంతా డ్రిప్ ఇరిగేషన్తో సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. మంచి పంటలు బాగా పండించాలి. గంగదేవిపల్లి గ్రామానికి డ్రిప్ ఇరిగేషన్ చేసుకునే విధంగా ప్రభుత్వం అన్ని రకాల సహాయం చేస్తుంది.
వెయ్యేండ్లు బతుకుతమా..?
మనం మనుషులుగా వెయ్యేండ్లు బతుకుతమా? ఉన్నన్ని రోజులు మనం మంచిపనులు చేసేందుకు మనవంతుగా తోడ్పాటును అందించుకోవాలి. మనం ఉన్నప్పుడు ఏం చేశామనేది ప్రతి మనిషి ఆలోచించుకోవాలి. దేశ స్వాతంత్య్రం కోసం మహాత్మాగాంధీ పోరాటం చేశారు. ఇవ్వాళ గాంధీ లేరు. కానీ ఆయన అందించిన స్ఫూర్తి ఉంది. ఆ స్ఫూర్తితో మనం ముందుకు సాగాలి. గ్రామసభలో తీసుకున్న నిర్ణయాలు పటిష్టంగా పట్టుదలతో అమలు చేసుకోవాలి. మనుషులుగా మీరు చూపించిన సంఘటిత శక్తి యావత్ తెలంగాణ సమాజానికి ఆదర్శంగా నిలవాలి. గంగదేవిపల్లి ఇదే స్ఫూర్తిని, ఐక్యతను సాధించి బంగారు పల్లి కావాలి. బంగారు తెలంగాణకు స్ఫూర్తివంతంగా నిలబడాలి.
గుడుంబా రాక్షసి పోవాలె..:
గంగదేవిపల్లి సభ అనంతరం నల్లబెల్లి మండలం మేడపల్లి-రాంపూర్ జంట గ్రామాల్లో ఏర్పాటు చేసిన గ్రామజ్యోతి సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. పల్లెల్లోనుంచి గుడుంబా మహమ్మారిని తరిమివేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినా పల్లెల్లో గుడుంబా రాక్షసి పట్టి పీడిస్తున్నదని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతి గ్రామంలో 20-30మంది వితంతువులు.. అదీ యువ వితంతువులు ఉంటున్నారు. చిన్న వయస్సులో వితంతువులుగా మార్చుతూ కుటుంబాలను వీధిపాలు చేస్తున్న ఈ గుడుంబా రాక్షసిని తరిమికొట్టాలి అని సీఎం పిలుపునిచ్చారు.
-సంఘటితంగా కదులుదాం
- ప్రజలంతా చేతులు కలిపితే వేల కోట్ల సంపద
- గంగదేవిపల్లి, అంకాపూర్, ముల్కనూర్..
ఈ మూడు గ్రామాలే అందుకు నిదర్శనం
- ప్రతీపశక్తులను పట్టించుకోవద్దు
- వ్యక్తులుగా బాగుంటున్నా.. సంఘంగా విఫలమవుతున్నాం
- గ్రామాల అభివృద్ధితోనే బంగారు తెలంగాణ
- గుడుంబా రాక్షసిని తరిమికొట్టాలి: సీఎం
- గంగదేవిపల్లిలో గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు
ప్రజలంతా చేతులు కలిపితే ఆ చేతులు వేల కోట్ల సంపదను సృష్టిస్తాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పారు. ప్రజలకు తమ సంఘటిత శక్తిలోని విలువ ఎంతో తెలియదని, గతంలో ఎవరూ చెప్పే ప్రయత్నం చేయలేదని అన్నారు. ఇకనైనా మేలుకొని ఎవరి గ్రామాన్ని వారే అభివృద్ధి చేసుకోవాలే తప్ప బయటివారు వచ్చి బాగుచేయరని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం బంగారు తెలంగాణ అవుతుందని సీఎం చెప్పారు. ఇందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. అభివృద్ధిని దెబ్బతీసే ప్రతీపశక్తులు అంతటా ఉంటాయని, వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగాలని ఉద్బోధించారు. వెలుతురు వెంటే చీకటి ఉంటుంది.
చీకటిని చూసి బెదిరిపోవద్దు, భయపడొద్దు. వ్యతిరేకించేవాళ్లు మనమధ్యే ఉంటారు. వారిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నారు. వ్యక్తులుగా మనం బాగుంటున్నాం కానీ.. కానీ సంఘంగా విఫలమవుతున్నామని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రజల సంఘటిత శక్తిలో ఉన్న పవర్.. ఫైర్ చాలా బలమైందన్న సీఎం.. ఆ బలంతోనే గంగదేవిపల్లి ఇరవై మూడేండ్లుగా మంచి అభివృద్ధి సాధించిందని చెప్పారు. రాష్ట్రంలోని పల్లెల ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేవేసే ప్రతిష్ఠాత్మక కార్యక్రమం గ్రామజ్యోతిని ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గంగదేవిపల్లిలో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రతి గ్రామం స్వయంపాలనతో స్వయం సమృద్ధి సాధించాలన్నదే గ్రామజ్యోతి లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం అందించే నిధులతో గ్రామానికి ఏం కావాలో ప్రజలే గ్రామసభల్లో నిర్ణయించుకొని అభివృద్ధిలో పాలు పంచుకోవాలని సీఎం పిలుపునిచ్చారు.
మీ స్ఫూర్తి గొప్పది..
గంగదేవిపల్లికి శిరస్సు వంచి మొక్కుతున్న. మీ స్ఫూర్తి గొప్పది. దేశ విదేశాల నుంచి చాలా మంది ఈ గ్రామానికి వచ్చి వెళ్లారు. నేను కూడా ఇక్కడికి వచ్చాను. రాష్ట్రంలో చాలా ఊళ్లు ఉన్నా వచ్చాను.. అంటే ఇక్కడ గంగమ్మతల్లులు రప్పించారు. వ్యక్తులుగా మనం బాగుంటున్నాం. కానీ సంఘంగా ఫెయిల్ అవుతున్నాం. ప్రజల సంఘటిత శక్తిలో ఉన్న పవర్.. ఫైర్ చాలా బలమైంది. ఆ బలంతో మీరు ఇరవై ఇరవైమూడేండ్లు మంచి అభివృద్ధి సాధించారు. మీకు మీరుగా గ్రామాన్ని గొప్పగా మలచుకున్నారు. ఇవ్వాళ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు. గంగదేవిపల్లిను చూస్తే కొత్త ఆశలు కలుగుతున్నయి. మీరు ఇక ఏదైనా సాధించగలరనే నమ్మకం ఏర్పడింది. అయితే ఇంతటితో ఆగకుండా స్వయం సమృద్ధి దిశగా ఎదగాలి
మూడు గ్రామాలు ఆదర్శం..
రాష్ట్రంలో మూడు గ్రామాలు ఎవరి మీదా ఆధారపడకుండా, ప్రభుత్వాలవైపు వేచి చేసి ఉండకుండా తమకు తోచిన విధంగా కట్టుబాట్లతో, పద్ధతులతో ఆదర్శవంతంగా ఎదిగాయి. నిజామాబాద్ జిల్లాలో అంకాపూర్, కరీంనగర్ జిల్లాలో ముల్కనూర్, వరంగల్ జిల్లాలో గంగదేవిపల్లి. ఈ మూడు గ్రామాలు ఆదర్శంగా, ప్రపంచం మెచ్చేలా నిలిచాయి. తెలంగాణలోని అన్ని గ్రామాలు ఈ మూడు గ్రామాలను ఆదర్శంగా, స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలి.
ఏ గ్రామానికాగ్రామం బాగుపడితే రాష్ట్రం బంగారు తెలంగాణ అవుతుంది. మనలో ఎంతో శక్తి ఉంది. భూమి మీదకు వచ్చినప్పుడు ఏదో ఒకటి చేసి వెళ్లాలి. మన స్ఫూర్తి భావితరాలకు ఆదర్శంగా ఉండాలి. పోరాడి తెచ్చుకున్న రాష్ట్రం బాగుపడాలి. ఎన్నికలు, రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి. బాగుపడడానికి గల కారణాలు అనేకం ఉంటాయి. చాలా సమస్యలు వస్తాయి. వెలుతురు వెంటే చీకటి ఉంటుంది. చీకటిని చూసి బెదిరిపోవద్దు, భయపడొద్దు. వ్యతిరేకించేవాళ్లు మనమధ్యే ఉంటారు. వారిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు
ఆర్థిక స్వాతంత్య్రం దిశగా అడుగేయండి
గంగదేవిపల్లి పట్టుదలతో సాధించిన ప్రగతి బాగా ఉంది. అయితే ఇంతటితో ఆగకుండా స్వయం సమృద్ధి దిశగా ఎదగాలి. స్వయం సమృద్ధి అంటే ఆర్థిక స్వాతంత్రం సాధించే దిశగా ఆలోచించాలి. గ్రామంలో అందరికీ భూమి ఉండదు. కాబట్టి భూమిలేని వాళ్లు, వృత్తిపనులు చేసుకునేవారికి ఇక్కడే ఉపాధి మార్గాలు సృష్టించి స్వయం ఉపాధి కల్పించుకోవాలి. వారికి ఆర్థిక చేయూతనివ్వాలి. వారితో రైతులకు కావలసిన ఎరువులు, విత్తనాలు గ్రామంలోనే అమ్మించి ఉపాధి కల్పించాలి. అట్లనే ఒక చెప్పుల దుకాణం పెట్టించాలి. ఆ దుకాణంలోనే ఊరోళ్లందరూ కొనుక్కునేలా చూడాలి. అదేవిధంగా కుట్టుమిషన్లు కొనిచ్చి ఉపాధి కల్పించాలి. ఇలా ఆయా వృత్తిపనుల వాళ్లకు ఉపాధి కల్పించే పని చేయవచ్చు. అలాగే మీ దగ్గర పంటల విధానం కూడా మార్చుకోవచ్చు.
ఇందుకు నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామం స్ఫూర్తిగా ఉంది. ప్రభుత్వం తరపున రెండు బస్సులు పెట్టి మిమ్మల్ని పంపిస్తా. వెళ్లి అక్కడ వ్యవసాయం పద్ధతులు చూసిరండి. అంకాపూర్లో కూడా మీలాగా బోర్లతోనే వ్యవసాయం చేస్తరు. అక్కడ గతంలో సర్వవర్గ సమితి ఉండే. కానీ దాని పేరు మార్చుకున్నారు. ఇప్పుడది విలేజ్ డెవల్మెంట్ కమిటీగా మారింది. ఆ గ్రామంలో పండే పంటలకు వారే మార్కెట్ చేసుకుంటారు. చేలనుంచి పంట వచ్చేసరికి ఆ గ్రామంవద్ద డజన్ల కొద్దీ డీసీఎంలు సిద్ధంగా ఉంటయి. అక్కడినుంచి అటే మార్కెట్కు తీసుకుపోతరు. అలాంటి పరిస్థితి మీ దగ్గర రావాలి. అలాగే గ్రామంలో డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి తేవాలి. ఇక్కడున్న 600 ఎకరాల వ్యవసాయ భూమి అంతా డ్రిప్ ఇరిగేషన్తో సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. మంచి పంటలు బాగా పండించాలి. గంగదేవిపల్లి గ్రామానికి డ్రిప్ ఇరిగేషన్ చేసుకునే విధంగా ప్రభుత్వం అన్ని రకాల సహాయం చేస్తుంది.
వెయ్యేండ్లు బతుకుతమా..?
మనం మనుషులుగా వెయ్యేండ్లు బతుకుతమా? ఉన్నన్ని రోజులు మనం మంచిపనులు చేసేందుకు మనవంతుగా తోడ్పాటును అందించుకోవాలి. మనం ఉన్నప్పుడు ఏం చేశామనేది ప్రతి మనిషి ఆలోచించుకోవాలి. దేశ స్వాతంత్య్రం కోసం మహాత్మాగాంధీ పోరాటం చేశారు. ఇవ్వాళ గాంధీ లేరు. కానీ ఆయన అందించిన స్ఫూర్తి ఉంది. ఆ స్ఫూర్తితో మనం ముందుకు సాగాలి. గ్రామసభలో తీసుకున్న నిర్ణయాలు పటిష్టంగా పట్టుదలతో అమలు చేసుకోవాలి. మనుషులుగా మీరు చూపించిన సంఘటిత శక్తి యావత్ తెలంగాణ సమాజానికి ఆదర్శంగా నిలవాలి. గంగదేవిపల్లి ఇదే స్ఫూర్తిని, ఐక్యతను సాధించి బంగారు పల్లి కావాలి. బంగారు తెలంగాణకు స్ఫూర్తివంతంగా నిలబడాలి.
గుడుంబా రాక్షసి పోవాలె..:
గంగదేవిపల్లి సభ అనంతరం నల్లబెల్లి మండలం మేడపల్లి-రాంపూర్ జంట గ్రామాల్లో ఏర్పాటు చేసిన గ్రామజ్యోతి సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. పల్లెల్లోనుంచి గుడుంబా మహమ్మారిని తరిమివేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినా పల్లెల్లో గుడుంబా రాక్షసి పట్టి పీడిస్తున్నదని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతి గ్రామంలో 20-30మంది వితంతువులు.. అదీ యువ వితంతువులు ఉంటున్నారు. చిన్న వయస్సులో వితంతువులుగా మార్చుతూ కుటుంబాలను వీధిపాలు చేస్తున్న ఈ గుడుంబా రాక్షసిని తరిమికొట్టాలి అని సీఎం పిలుపునిచ్చారు.






